కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా!

by సూర్య | Fri, Jun 21, 2019, 11:22 AM

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల విజయవాడలో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త సెల్వమణితో కలిసి గృహప్రవేశం చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజధానిగా దగ్గరగా రోజా దంపతులు ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితవర్గాలు చెప్పాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరిలోనే ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె నగరి నుంచి ఘనవిజయం సాధించారు. మరోవైపు నవరత్నాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూసే బాధ్యతను సీఎం జగన్ రోజాకు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో కలిసి రోజా ఈ పథకాలను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM