by సూర్య | Fri, Jun 21, 2019, 11:21 AM
చంద్రబాబు అలా ఫ్లైట్ ఎక్కి విదేశానికి వెళ్లారో లేదో, పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు ఇలా సైకిల్ దిగి కమలం గూటికి వెళ్లిపోయారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన ఎంపి కూడా కమలం తీర్ధం పుచ్చుకుంటారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. వైసీపీ తరపున నర్సాపురం నుండి పోటీచేసి గెలిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు తాజాగా బీజేపీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు దర్శనమివ్వటంతో ఈ వాదనలు వాస్తవ రూపం దాల్చటానికి ఎంతో సమయం పట్టదనేలా ఏంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ పార్టీగా ఎదగటానికి బీజేపీ పావులు కదుపుతూ టీడీపీ లోకి ప్రధమ,ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకుంటున్న నేపథ్యంలో కేసులు, అవసరాల దృష్య్టా పలువురు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారని సమాచారం.
Latest News