by సూర్య | Thu, Jun 20, 2019, 09:23 PM
నలుగురు తెలుగుదేశం పార్టీ రాస్యసభ సభ్యులతో బిజెపిలోకి వసలు ఆగిపోలేదని, తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే బిజెపిని తెలుగు రాష్ట్రాలలో బలోపేతానికి తాము తీసుకుంటున్న చర్యలకారణంగా బీజేపీ నాయకత్వం, నరేంద్రమోదీ పాలన పట్ల నమ్మకం ఉండబట్టే అనేకమంది బీజేపీ వైపు చూస్తున్నారని, త్వరలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, వారి పేర్లు బయటపెట్టబోమనిస్పష్టం చేసారు. ప్రధాని మోడీ అమలు చేసు్తన్న సంక్షేమపధకాలకు ప్రజల్లో ఉన్న ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందని, అందుకే తెలుగురాష్ట్రాలలోని అన్ని పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ క్రమేణ బలపడుతుందన్నదానికి ఇదొక నిర్శనమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఏపిలో తెలుగుదేశం స్థానాన్ని బిజెపి ఆక్రమించబోతోందని జివిఎల్ ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం
Latest News