by సూర్య | Thu, Jun 20, 2019, 08:33 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో నవరత్నాల అమలుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. రైతుల పథకాలు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలతోపాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.
Latest News