by సూర్య | Thu, Jun 20, 2019, 05:32 PM
ఢిల్లీ : ఎపి టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ, ఏపీలో టీడీపీ నాయకత్వంపై ఆ పార్టీ కార్యకర్తలకు విశ్వాసం పోయిందని అన్నారు. చాలామంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోడీ విధానాలు నచ్చి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
Latest News