by సూర్య | Sat, Mar 23, 2019, 01:18 AM
జనసేన అభ్యర్ధి మైలపల్లి శ్రీనివాసరావు జనసేన కార్యకర్తలతో కలిసి విజయనగరం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాను సమయానికి వచ్చినప్పటికీ.. తన నామినేషన్ ను కాదని, బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి ల నామినేషన్ లను ముందుగా తీసుకున్నారని శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తమ నేత సమయాని కంటే ముందుగానే వచ్చినప్పటికీ నామినేషన్ పత్రాలు తీసుకోలేదంటూ జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఈ విషయమై జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు ఆర్ఒ ను ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలు తీసుకునే వరకూ కదలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు
Latest News