by సూర్య | Fri, Mar 22, 2019, 11:59 PM
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి రెబల్గా కొరగంజి జగన్ స్వతంత్ర శాసన సభ్యుల అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం వన్టౌన్ కొరగంజి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ జెండాలు మోస్తూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా తనను చిన్న చూపుచూస్తున్నారన్నారు. పశ్చిమంలో బీసీలకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని అందుకే శాసనసభ్యుల అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో ఇప్పుడే చెట్టుగా ఎదుగుతున్న పార్టీకి తాను వత్తాసు పలకనన్నారు. స్థానికుల సమస్యలు తెలిసిన వాళ్లే పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తేనే ఇక్కడ సమస్యలు తెలుస్తాయన్నారు. తనను అభిమానిస్తున్న ప్రజల కోరిక మేరకు స్వతంత్ర పోటీకి సిద్ధమయ్యానని ఆయన స్పష్టం చేశారు.
Latest News