by సూర్య | Fri, Mar 22, 2019, 10:30 PM
నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన జరుగనున్న మత్స్య జయంతి గోడపత్రికలను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఆవిష్కరించారుఈ సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు శాంతిహోమం, స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
Latest News