హిందూపురాన్ని బెంగళూరులా మార్చి చూపిస్తా: బాలకృష్ణ

by సూర్య | Fri, Mar 22, 2019, 12:50 PM

భవిష్యత్తులో హిందూపురం పట్టణాన్ని మరో బెంగళూరు నగరంలా మార్చి చూపిస్తానని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఆయన, సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు కొన్ని దుష్టశక్తులు తయారయ్యాయని విమర్శించారు. అధికారంలోకి రానున్నది టీడీపీయేనని వ్యాఖ్యానించిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తాయన్న నమ్మకముందని చెప్పారు. జిల్లాలోనే హిందూపురం అభివృద్ధిపథంలో ముందంజలో ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని పిలుపునిచ్చారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM