by సూర్య | Fri, Mar 22, 2019, 11:57 AM
మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. చిత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సీకేబాబు టీడీపీలో చేరనుండటంతో... టీడీపీ అభ్యర్థి ఏఎన్ మనోహర్ విజయావకాశాలు మెరుగయ్యాయని టీడీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. ఆయనతో పాటు ఇండిపెండెండ్ కార్పొరేటర్లు మాధవి వెంకటేష్, రమణ, చందు, మురళి, చిత్తూరు మున్సిపాలిటీ మాజీ ఛైర్ పర్సన్ సరళ మేరీలు తదితరులు కూడా టీడీపీలో చేరుతున్నారు.
Latest News