by సూర్య | Fri, Mar 22, 2019, 11:32 AM
అమరావతి: విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతున్న మోహన్ బాబుకు మద్దతిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. తిరుపతిలో మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, తన ట్విట్టర్ ఖాతాలో కన్నా స్పందించారు. ప్రజాస్వామ్య విలువలు లేని నువ్వు 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకోడానికి సిగ్గుపడాలన్నారు. సినీనటుడు మోహన్ బాబు విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలియచేస్తోందన్నారు. విద్యార్థుల కోసం పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
Latest News