నేడు ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఎన్నికలు

by సూర్య | Fri, Mar 22, 2019, 08:45 AM

ఓవైపు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగానే, ఈ సందట్లో ఏపీలో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఇవాళ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 5,62,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు ఎన్నికల్లో మొత్తం 94 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ కోసం 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 26న ఉంటుంది.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM