by సూర్య | Fri, Mar 22, 2019, 12:11 AM
కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన సిటింగ్ ఎమ్మల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆ టిక్కెట్ కాస్త టి.జె భరత్ కు దక్కడంతో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఆయన లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలోకి తనని తీసుకోవాలని కోరటంతో జగన్ కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు, గతంలో వైసిపి తరపు ఎన్నికైన తనని అభివృద్ధి పేరుతో మాయచేసి తెలుగుదేశం వైపు నడిపించారని, ప్రస్తుత ఎన్నికలలో ఉద్దేశ పూర్వకంగానే తనని పక్కకు పెట్టి వారసులకు టిక్కెట్టు ఇచ్చుకున్నారనిఆరోపించారు. టిక్కెట్ నీదేనని మోసం చేసే నైజం చంద్రబాబుదైతే, మోసం చేసే నైజం లేని నాయకుడు వైఎస్ జగన్. అందుకేనేను గతంలో చేసిన. తప్పు తెలుసుకున్నాను. అందుకే తిరిగి సొంత గూటికి చేరుకున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తా అని చెప్పారు.
Latest News