జ‌గ‌న్ చెంత‌కు చేరిన ఎస్వీ

by సూర్య | Fri, Mar 22, 2019, 12:11 AM

కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన సిటింగ్ ఎమ్మ‌ల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ఆ టిక్కెట్ కాస్త టి.జె భ‌ర‌త్ కు ద‌క్క‌డంతో తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఆయ‌న లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసి పార్టీలోకి త‌న‌ని తీసుకోవాల‌ని కోర‌టంతో జ‌గ‌న్‌ కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్వీ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతు, గ‌తంలో వైసిపి త‌ర‌పు ఎన్నికైన త‌న‌ని అభివృద్ధి పేరుతో మాయ‌చేసి తెలుగుదేశం వైపు న‌డిపించార‌ని, ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌లో ఉద్దేశ పూర్వ‌కంగానే త‌న‌ని ప‌క్క‌కు పెట్టి వార‌సుల‌కు టిక్కెట్టు ఇచ్చుకున్నార‌నిఆరోపించారు.  టిక్కెట్ నీదేన‌ని మోసం చేసే నైజం చంద్ర‌బాబుదైతే, మోసం చేసే నైజం లేని నాయకుడు వైఎస్‌ జగన్‌.  అందుకేనేను గ‌తంలో చేసిన‌. తప్పు తెలుసుకున్నాను. అందుకే తిరిగి సొంత గూటికి చేరుకున్నా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తా అని చెప్పారు. 


 

Latest News

 
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM