24 నుంచి హజ్రత్ కలే మస్తాన్ షా 127వ ఉరుసు ఉత్స‌వాలు

by సూర్య | Thu, Mar 21, 2019, 11:31 PM

 24 నుంచి గుంటూరులో హజ్రత్ కలే మస్తాన్ షా 127వ ఉరుసు మమహోత్సవాలు నిర్వహించనున్నట్లు హజరత్ కలే మస్తాన్ షా వలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్న‌ట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా భక్తులు కులమతాలకు అతీతంగా బాబా వారిని ధర్శించి బాబా కృపకు పాత్రులు కావాలని తెలిపారు. 24న ఆదివారం తెల్లవారుజామున చాందిని అలంకారణ బాబాగారు సమాధిపై గంధ మహోత్సవములు రాత్రి పదకొండు గంటలకి సందల్(గంధం) ఊరేగింపు, అన్నదానం, 25న సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గంధం పంచుట, 5 గంటలకు దీపారాధన, అన్నదానం ఉంటుందని తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటలకు గ్యార్మీ షరీఫ్ (పవిత్ర ఖురాన్ పఠనము) తెల్లవారుజామున ప్రసాదం పంచుతామన్నారు, బుధవారం ఫకీర్లకు అన్నదానము,బాబా వారికి సంవత్సరము మొత్తం భక్తులు సమర్పించిన (చాడరులు) శేష వస్త్రాలు పంచుతామన్నారు. ఆఖరి రోజు గురువారం బాబా వారు ఆసీనులైన కుర్చీని యథా స్థానమందు ఉంచుతామన్నారు . బాబాగారి పవిత్ర మహోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యర్థం ఐదు రోజుల పాటు వైద్య సేవలు వైద్య సేవలు,మందులు ఉచితంగా” అందించనున్నట్లు తెలిపారు.2007వ సంవత్సరం నుంచి నిత్యాన్నదానం కొనసాగుతుంద‌ని, నిత్యాన్నదానానికి సహకరించాలనే భక్తులు తమ వివరాలను తెలియజేయాలని కోరారు.


 


 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM