by సూర్య | Thu, Mar 21, 2019, 06:57 PM
నెల్లూరు నగరంలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీమతి పనబాక లక్ష్మి గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నగరంలోని వి ఆర్ సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కు ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Latest News