by సూర్య | Thu, Mar 21, 2019, 06:54 PM
ఏపీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న శ్రీరామ్, అవినాష్ లకు హీరో మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. వీరిరువురు టీడీపీ నుంచి పార్టీ సీనియర్ నేతల వారసులు బరిలోకి దిగుతున్న విషయం మనం తెలిసిందే. వీరిలో ఒకరు పరిటాల సునిత కొడుకు శ్రీరామ్, దివంగత దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ మరోకరు. కాగా అనంతపురం రాప్తాడు నుంచి శ్రీరామ్, కృష్ణా జిల్లా గుడివాడ నుంచి అవినాష్ లకు టికెట్లను కేటాయించారు చంద్రబాబు. కాగా వారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాజకీయాల్లో వీళ్లిద్దరూ వారి తండ్రుల స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు విష్ణు తెలిపారు.
Latest News