జ‌న‌సేన‌కు ప్రత్తిపాడు సమన్వయకర్త గుడ్‌బై

by సూర్య | Thu, Mar 21, 2019, 06:23 PM

తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త సాయికుమార్ యాదవ్ జనసేనకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు పార్టీలో చేరాలని మంతానాలు జరిపారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి వరపుల రాజా సమక్షంలో సాయికుమార్ కండువా కప్పుకున్నారు. గురువారం ఉదయం రెండు వేల మంది అనుచరులు, కార్యకర్తలతో సాయికుమార్ టీడీపీ కండువా కప్పుకున్నారు.ఆయన ప్రత్తిపాడు టికెట్ ఆశించగా.. పవన్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి-23న జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో సాయికుమార్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు జనసేన నేతలు టికెట్లు దక్కకపోవడంతో జంపింగ్‌‌లు చేసిన విషయం విదితమే.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM