by సూర్య | Thu, Mar 21, 2019, 04:26 PM
రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ.. తాను చేసిన అభివృద్ధి తనకు కనిపిస్తుందన్నారు. తాను ఈ నియోజకవర్గంలో రూ.200 కోట్ల పైగా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశానన్నారు. స్థానికుడుగా తనకు ఓటు వేయాలని త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఎక్కడి నుండో వలస వచ్చిన అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు.
Latest News