by సూర్య | Thu, Mar 21, 2019, 12:30 PM
జమ్మూకశ్మీర్లోని సోపోర్లో ఇవాళ ఉగ్రవాదులు భద్రతా దళాలపై గ్రేనేడ్ దాడి చేశారు. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. సోపోర్లోని మెయిన్ చౌక్లో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని సెక్యూర్టీ ఫోర్సెస్ చుట్టుముట్టాయి. గ్రేనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. మందస్తుగా అక్కడ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు.
Latest News