by సూర్య | Thu, Mar 21, 2019, 11:32 AM
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22వ తేదీన పులివెందుల శాసనసభ నియోజక వర్గం నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ కోసం పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా వైఎస్ జగన్ గురువారం పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో హైదరాబాద్లో సమావేశమై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో మేనిఫెస్టో తుది ముసాయిదాపై కసరత్తు జరగనుంది.కారణంగా గురువారం జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Latest News