చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని బుద్దా వెంకన్న హోమం

by సూర్య | Thu, Mar 21, 2019, 10:52 AM

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ మల్లికార్జునపేట లోని ఆయన నివాసంలో చండీహోమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని యాగం చేస్తున్నామన్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడి దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో నేరుగా చంద్రబాబుతో తలపడే ధైర్యం లేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఐదు కోట్ల మంది ప్రజలు నిర్ణయం తీసుకున్నారని బుద్దా వెంకన్న అన్నారు. చండీహోమంలో బుద్దా వెంకన్న దంపతులతో పాటు తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.

Latest News

 
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM
ఏప్రిల్ 4న విజయనగరంలో పర్యటించనున్న పవన్ Fri, Mar 29, 2024, 11:01 AM
బీసీలకు రక్షణ చట్టం అమలుచేస్తాం Fri, Mar 29, 2024, 11:01 AM
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి Fri, Mar 29, 2024, 10:59 AM
నేడు 3 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు Fri, Mar 29, 2024, 10:59 AM