by సూర్య | Thu, Mar 21, 2019, 10:38 AM
జనసేన పార్టీ అధినేత నేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఇవాళ గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి ఆర్అండ్ బి దరి మారియట్ హోటల్ లో కాసేపు బస చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
Latest News