by సూర్య | Thu, Mar 21, 2019, 10:36 AM
రోడ్డుప్రమాదంలో 20మందికి గాయాలైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలూరు పరిధిలోని హాలహర్వి మండలం చింతకుంట దగ్గర కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈప్రమాదంలో బొలెరోలో వెళ్తున్న20మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Latest News