by సూర్య | Thu, Mar 21, 2019, 09:41 AM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ లు శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పేరిట తిరుమలలో అన్నదానం ఒక్కరోజు నిర్వహణకు అయ్యే రూ.30లక్షలు విరాళమిచ్చారు. అన్నదానం నిర్వహణకు ఒక్కరోజు అయ్యే రూ.30లక్షలు విరాళం సీఎం చంద్రబాబు పంపారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు చంద్రబాబు కుటుంబ సభ్యులు వడ్డించారు. భక్తులకు అన్నప్రసాదం వడ్డించి దేవాన్ష్, భువనేశ్వరి, బ్రాహ్మణి అల్పాహారం సేవించారు.
Latest News