by సూర్య | Thu, Mar 21, 2019, 09:40 AM
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు, దేవ విదేశాల్లోని తెలుగువారికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండే ఆనంద ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు వేడుకల్లో ప్రకృతిసిద్ధ మూలికలతో చేసిన రంగులు ఉపయోగించాలని సూచించారు. నదులు, సముద్రాలు, చెరువులు, సరస్సుల్లో ఈత కొడుతూ ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.
Latest News