by సూర్య | Wed, Mar 20, 2019, 10:37 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎక్కడ నుంచి పోటీకి దిగినా ఆతని పై పోటీ చేసేందుకు తను సిద్దమేనని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తేల్చి చెప్పారు. ఓ టీవీ ఛానల్కి బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ మాట్లాడుతూ.. గతంలో నాగబాబు తన పార్టీ పోటీ విషయంలో సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, పాలకొల్లులో నాగబాబు పోటీకి దిగితే తానూ రెడీ గా ఉన్నానని ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది ఆయనే నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ రాష్ట్రానికి. మనకు కావలసింది.. నటులు కాదు. అభివృద్ధి కావాలి. నిరుద్యోగం పోవాలన్నదే తన కాంక్షని తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో అపోలో కంటే మెరుగైన హాస్పిటల్స్ ప్రారంభిస్తానని, ప్రపంచ దేశాల నుంచి తనకున్న పరిచయాలతో లక్షలాది కోట్ల నిధులు పారించి, అనేక ఫ్యాక్టరీలు నిర్మాణం చేయిస్తానని అన్నారు.
Latest News