by సూర్య | Wed, Mar 20, 2019, 07:49 PM
ఉద్యోగుల పరకామణి విధుల నిర్వహణ, ఉద్యోగుల క్యాంటీన్లో సౌకర్యాలు తదితర అంశాలపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం బుధవారం సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిష్కరించాలని జెఈవో సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్తగిరి మాసపత్రికకు సంబంధించి ఎడిటర్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి ఎడిటర్ను ఇన్చార్జిగా నియమిస్తామన్నారు. పాఠకులకు సకాలంలో పత్రిక అందేలా ఈ విభాగం పని చేస్తుందన్నారు. సప్తగిరి మాసపత్రిక సర్కులేషన్ను మరో లక్ష కాపీలు పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రధాన సంపాదకులు డా.. రాధారమణను ఆదేశించారు.
Latest News