by సూర్య | Wed, Mar 20, 2019, 07:43 PM
టిటిడిలో ఏప్రిల్ నెలలో జాతీయ నాయకుల జయంతి వేడుకల నిర్వహణపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం బుధవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 5న జగజ్జీవన్రామ్ జయంతి, 11న మహాత్మా జ్యోతిరావ్పూలే జయంతి, 14న డా..బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉగాది వేడుకల నిర్వహణకు చక్కటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉగాది సందర్భంగా ఉద్యోగులకు, వారి పిల్లలకు క్విజ్, వ్యాసరచన, వేషధారణ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.
Latest News