గోరంట్ల మాధవ్ కు షాక్.. ఆయన భార్యకు టికెట్ దక్కే అవకాశం

by సూర్య | Wed, Mar 20, 2019, 03:52 PM

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి ఇరు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన సీఐ గోరంట్ల మాధవ్ కు షాక్ తగిలింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. హిందూపురం లోక్ సభ టికెట్ ను ఆయనకు వైసీపీ అధినేత జగన్ కేటాయించారు. ప్రచారంలో కూడా మాధవ్ దూసుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలైన టెన్షన్ ఇప్పుడే మొదలైంది. వీఆర్ఎస్ కోసం మాధవ్ చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. దీంతో, ప్రభుత్వ అధికారిగానే ఆయన ఇంకా కొనసాగుతున్నట్టు లెక్క. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో, వైసీపీ హైకమాండ్ దీనిపై సీరియస్ గా ఆలోచిస్తోంది. మాధవ్ స్థానంలో ఆయన భార్యతో పాటు, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప పేర్లను పరిశీలిస్తోంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM