by సూర్య | Wed, Mar 20, 2019, 11:30 AM
పులివెందుల: నాన్న మరణం మమ్మల్ని ఎంతో కుంగదీసింది. నాన్నపై మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలు కన్నీరు తెప్పించాయి. మా నాన్నను అతికిరాతకంగా హత్య చేశారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డిని సీఎంగా చూడాలని మా నాన్న కోరుకునే వారు వివేకా హత్యకు సంబంధించి నిష్ఫాక్షికమైన దర్యాప్తు జరగాలి. నాన్నకు ఎప్పుడూ ప్రజలే ముఖ్యం.. తర్వాత కుటుంబం. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. మాది చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా సభ్యులున్నారు. గత కొంతకాలంగా అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదు. చాలా కాలంగా పులివెందులలో నాన్న ఒక్కరే ఉంటున్నారు. జగన్ మోహన్రెడ్డిని సీఎంగా చూడాలన్నది మా నాన్న కల. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు.
Latest News