మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులకు నమ్మకం లేదు!: విజయసాయిరెడ్డి

by సూర్య | Wed, Mar 20, 2019, 11:12 AM

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై వైసీసీ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మంగళగిరి నుంచి గెలుస్తామన్న నమ్మకం చంద్రబాబు, లోకేశ్ కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే శాసనమండలి సభ్యుడిగా రాజీనామా చేయకుండానే లోకేశ్ ను పోటీచేయిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు. టీడీపీ తరఫున మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేశ్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Latest News

 
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM