by సూర్య | Tue, Mar 19, 2019, 09:19 PM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీ చేసిన మోదీ ఈసారి వారణాసికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం వైపై మొగ్గు చూపిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, ఉత్తర ప్రదేశ్ పై ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి పెట్టడంతో మోదీ కూడా యూపీ నుంచి పోటీలో ఉండాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం నుంచి యూపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మోదీ పోటీ చేయనున్న వారణాసిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2014లో గుజరాత్ లోని వడోదరా, యూపి లోని వారణాసి నుంచి గెలుపొందిన మోదీ తరువాత వడోదరా స్థానానికి రాజీనామా చేశారు.
Latest News