by సూర్య | Tue, Mar 19, 2019, 06:54 PM
గుంటూరు : గుంటూరు జిల్లా వేమూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ...ఐదేళ్ల పాటు మోసాలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ మీ భవిష్యత్..ఆయన బాధ్యత అంటున్నాడు.ఐదేళ్లలో ఒక పంటకూ గిట్టుబాట ధర లభించలేదు. ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరచిన బాబు ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. ఐదేళ్లలో ఏమీ చేయని సిఎం అన్నీ చేసానని చెప్పుకుంటున్నారన్నారు. చిలకా గోరింకల్లా బిజెపితో కాపురం చేసిన చంద్రబాబు పదేళ్లు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, మంత్రులుగా తమ ఎంపీలను చేసి ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా డిమాండ్ చేయలేదన్నారు. నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నట్లుగా కొత్త డ్రామాలేపారన్నారు. చంద్రబాబు ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త డ్రామాలను చూపించే కాలం గడిపేశారన్నారు.
Latest News