రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తా-ప‌వ‌న్‌

by సూర్య | Tue, Mar 19, 2019, 06:36 PM

అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రేస్‌లో నిలుస్తోంది. జనసేన పార్టీ ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నియాజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగనుంది.
ఈ విష‌యంపై స్పందించిన ప‌వ‌న్  తాను రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తానన్న విషయమై జనరల్ బాడీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాగా, ఆయన విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈరోజు వెల్లడించే జనసేన మరో జాబితాలో పవన్ కల్యాణ్‌తో పాటు, ఇటీవల పార్టీలో చేరిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణల నియోజకవర్గాలపై స్పష్టత రావచ్చు.


 


 


 

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM