by సూర్య | Tue, Mar 19, 2019, 06:14 PM
కడప ఎన్నికల బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... పులివెందులకు నీళ్లు ఇచ్చింది మేమే. రాయలసీమ రాళ్ల సీమ కాదు ..రథనాల సీమగా చేసే బాధ్యత నాదే అని అన్నారు.మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇస్తాం. కేంద్రం మనకు సహకరించలేదు. చివరకి కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని సంతృప్తి కలిగించిందన్నారు. రైతులను రుణమాఫీ చేశామని, ప్రతిరైతుకు పదివేల రూపాయలు ఇచ్చి పెట్టుబడిగా ఆదుకున్నామని, అక్కచెల్లెళ్లకు నగదు, వృద్ధులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు ఒక అన్నగా పెన్షన్ ఇచ్చానని, రైతులకు ఎన్ని సబ్సిడీలు ఇవ్వాలో అన్నీ ఇచ్చామని, ప్రకృతి వ్యవసాయానికి రైతులను లాభసాటిగా మార్చమని, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి అనుకురార్పణ చేయడం, ఎక్కడికక్కడ పోర్టులు, విమానాశ్రయాలు, నదుల అనుసంధానం, రాష్ట్ర భవిష్యత్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిసినపుడు రెట్టింపు ఆనందం, సంతృప్తి ఉంటాయన్నారు.
Latest News