by సూర్య | Tue, Mar 19, 2019, 12:44 PM
ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యలగూడెంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొననున్నారు. హెలీప్యాడ్ నుంచి జగన్ కార్లు, భారీ మోటార్ సైకిళ్లు, ఆటో ర్యాలీతో జగన్ సభా ప్రాంగణానికి వెళ్లారు. జగన్ సభ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు. సభా ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది.
Latest News