by సూర్య | Tue, Mar 19, 2019, 10:32 AM
న్యూఢిల్లి : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలుగుతుందని ఢిల్లి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఢిల్లి శాఖ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ అన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆప్తో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని, తద్వారా కార్యకర్తల్లో అయోమయానికి తావుండదని రాహుల్కు రాసిన లేఖలో షీలాదీక్షిత్ పేర్కొన్నారు.
Latest News