by సూర్య | Tue, Mar 19, 2019, 10:07 AM
నేడు సోషల్ మీడియా సంస్థలతో ఎన్నికల సంఘం భేటీకానున్నది. ఢిల్లీలో ఈ సమావేశం జరగనున్నది. లోక్సభ ఎన్నికల వేళ ఎలాంటి నియమావళిని పాటించాలన్న అంశంపై సోషల్ మీడియా సంస్థలకు ఎన్నికల సంఘం సూచనలు చేయనున్నది. నిజానికి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో.. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ ఆరోరా కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సంస్థల ప్రతినిధులతో ఈసీ భేటీకానున్నది.
Latest News