నేడు సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌తో ఈసీ భేటీ

by సూర్య | Tue, Mar 19, 2019, 10:07 AM

నేడు సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌తో ఎన్నిక‌ల సంఘం భేటీకానున్న‌ది. ఢిల్లీలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఎలాంటి నియ‌మావ‌ళిని పాటించాల‌న్న అంశంపై సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌లు చేయ‌నున్న‌ది. నిజానికి ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించ‌డంతో.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌లులోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాపై ఈసీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునిల్ ఆరోరా కూడా ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ లాంటి సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఈసీ భేటీకానున్న‌ది.

Latest News

 
వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం Fri, Mar 29, 2024, 01:18 PM
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM