అలాంటి రాష్ట్రంలో ఓ గ్రామంలో బాణసంచాపై నిషేధం

by సూర్య | Thu, Oct 31, 2024, 10:22 PM

తమిళనాడు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఆ రాష్ట్రం బాణసంచా, టపాసులకు ప్రసిద్ధి చెందిన విషయం తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి ప్రాంతం బాణసంచా తయారీకి ముఖ్యకేంద్రంగా విలసిల్లుతోంది. దేశంలో అన్ని ప్రాంతాలకు ఇక్కడ్నించే బాణసంచా సరఫరా అవుతుంది. అలాంటి తమిళనాడు రాష్ట్రంలోని ఓ గ్రామంలో అసలు బాణసంచానే కాల్చరంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఊరి పేరు పెరంబూరు. మైలదుత్తురై జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో దీపావళికి కూడా బాణసంచా కాల్చడం నిషిద్ధం. అందుకు కారణం ఉంది. పెరంబూరు గ్రామంలోని ఓ పెద్ద మర్రిచెట్టుకు వేళ్లాడుతూ వందలాది కబోది పక్షులు ఉంటాయి. ఆ మహా మర్రిచెట్టును గ్రామస్తులు భగవాన్ మునీశ్వరన్ కు చెందినదిగా భావిస్తారు. దాంతో, ఆ చెట్టుకు, ఆ చెట్టు పరిసర ప్రాంతాలకు ఆధ్యాత్మిక గుర్తింపు వచ్చింది. ఆ మర్రి చెట్టుపై ఉండే కబోది పక్షులను కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే, ఆ చెట్టు జోలికి, ఆ చెట్టుపై ఆవాసం ఉండే కబోది పక్షుల జోలికి ఎవరూ వెళ్లరు. బాణసంచా కాల్చితే ఆ పేలుళ్లకు పక్షులు భయపడి వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో గ్రామస్తులు టపాసుల జోలికి వెళ్లరు. ఇతర గ్రామాల వారు పెరంబూరు గ్రామస్తులతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే, వారికి కూడా మర్రిచెట్టు మహత్మ్యం గురించి, ఆ చెట్టుపై ఉండే కబోది పక్షుల గురించి, బాణసంచాపై నిషేధం ఉన్న సంగతి ఈ గ్రామస్తులు చెబుతారు. పెళ్లి, ఇతర వేడుకల్లో బాణసంచా కాల్చడం కుదరదన్న విషయాన్ని వారికి వివరిస్తారు. పెరంబూరులో దాదాపు 1,500 మంది నివసిస్తుంటారు. వారిలో చాలామంది రైతులే. వారి పర్యావరణ స్పృహను ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు సైతం ప్రశంసిస్తున్నారు.

Latest News

 
టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్ Sat, Apr 11, 2026, 04:10 PM
భారీగా పెరిగిన నిమ్మకాయల ధర! Sat, Apr 11, 2026, 03:44 PM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి‌పై కేసు నమోదు Sat, Apr 11, 2026, 03:03 PM
ఏపీలో ఒ వైపు ఎండ.. మరో వైపు వర్షాలు Sat, Apr 11, 2026, 10:35 AM
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం Fri, Apr 10, 2026, 04:00 PM