ఝార్ఖండ్‌లో ఓ వీధిలో ఛాయ్ తాగిన భట్టివిక్రమార్క

by సూర్య | Thu, Oct 31, 2024, 06:53 PM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేడు జాబితాను విడుదల చేశారు.ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు భట్టివిక్రమార్క కూడా ఉన్నారు.మరోవైపు, భట్టి విక్రమార్క ఇప్పటికే ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అక్కడి నేతలతో సమావేశమవుతున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఝార్ఖండ్‌లో తన పర్యటనకు సంబంధించి భట్టివిక్రమార్క ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బోకారోలో ఓ చాయ్ దుకాణంలో టీ తాగారు. వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.

Latest News

 
శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం Sun, Nov 09, 2025, 07:56 AM
చాదస్తం భరించలేక అత్తను హత్య చేసిన కోడలు Sun, Nov 09, 2025, 07:26 AM
సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు సుదీర్ఘంగా విచారణ Sun, Nov 09, 2025, 07:20 AM
కుప్పంలో రూ. 586 కోట్లతో హిండాల్కో అల్యూమినియం ప్లాంట్ Sun, Nov 09, 2025, 06:18 AM
ప్రతి ప్రజాప్రతినిధి వారానికోసారి 'ప్రజా వేదిక' నిర్వహించాలని స్పష్టీకరణ Sun, Nov 09, 2025, 06:16 AM