ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా?

by సూర్య | Mon, Mar 20, 2023, 02:05 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో దాడి జరిగిన తీరును లోకేష్‌కు గోరంట్ల వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీవో 1 రద్దు చేయాలని డిమాండ్ చేయడం కూడా జగన్ పాలనలో నేరమేనా? అని ప్రశ్నించారు. ఉన్నత విలువలతో సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న గోరంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఘటనను ప్రజాస్వామ్యవాదులు అందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపిచ్చారు. బుచ్చయ్య చౌదరిపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్‌డే గా లోకేష్ అభివర్ణించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM