by సూర్య | Mon, Mar 20, 2023, 02:04 PM
తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్రెడ్డి పిటిషన్ వేశారు. వివేక హత్య కేసులో ఏ-4 దస్తగిరినీ అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సిబిఐ విచారించింది. కాగా, దస్తగిరినీ అప్రూవర్గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో..‘‘దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే..దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించింది..దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్’’లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
Latest News