హర్షం వ్యక్తం చేసిన రమేష్ నాయుడు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:17 AM

రాజంపేట మండల పరిధిలోని పోలి గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడం పట్ల బిజెపి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సర్వే నెంబర్ 1802/4, 1802/5 మరియు 1813 లో ఉన్న 7. 32 ఎకరాల భూమిని పాఠశాల సాధించడానికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల నేటి వరకు అద్దె భవనాలలో నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పోలి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాల పాఠశాల ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించగలుగుతారని తెలిపారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM