వైకాపాకు పతనం ప్రారంభమైనది - కొమర

by సూర్య | Sun, Mar 19, 2023, 10:38 AM

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం ఖాయం కావడంతో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట మండల నాయకులు కొమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున బాణాసంచా కాల్చుతూ తప్పెట్లతో ఒంటిమిట్ట గ్రామ దేవాలయం దగ్గర టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి పతనం పులివెందుల నుంచి కడప జిల్లా నుంచి ప్రారంభమైందని వైఎస్ఆర్సిపి పార్టీని బంగాళాఖాతంలో - ప్రజలు కలిపారని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ రెడ్డి నిరుద్యోగులను నాలుగు సంవత్సరాల పాటు దారుణంగా మోసగించాడని ఇందుకు ప్రతిఫలంగా పట్టభద్రులు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గము నుంచి భూమిరెడ్డి కి ఓట్లు వేసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాటపల్లి శివారెడ్డి, మామిళ్ళ శ్రీహరి, బొడిచర్ల శ్రీనివాసులు, శరత్ రెడ్డి, చాంద్ భాషా, పసుపులేటి వెంకటరమణ, షేక్ రంతుల్లా, షా హుస్సేన్, కొత్తపల్లి పలుకూరి ఆంజనేయులు, పలుకూరి శ్రీరాములు, మామిడి శ్రీనివాసులు, సుమారు 100 పైబడి తెలుగుదేశం పార్టీ వీర అభిమానులు పాల్గొనడం జరిగింది.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM