by సూర్య | Fri, Jan 27, 2023, 11:47 PM
తారకరత్న అస్వస్థతకు గురవడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 'నందమూరి తారకరత్న కుప్పంలో అస్వస్థతకు గురవడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై.. తిరిగి రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదిలావుంటే నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షిస్తున్నారు.