ఉతికినా.. నలుపు నలుపే గానీ తెలుపు రాదు.. అంబటి రాంబాబు

by సూర్య | Fri, Jan 27, 2023, 09:06 PM

 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా.. నలుపు నలుపే గానీ తెలుపు రాదు!. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు.. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ట్వీచ్ చేశారు. ఇదిలావుంటే గణతంత్ర దినోత్సవం రోజున.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుపై మంత్రి అంబ‌టి రాంబాబు విమర్శలు గుప్పించారు. 'మా నాన్న హేతువాది. మా నాన్న, పెదనాన్న ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. మా నాన్న ఎలాంటి వారు అంటే.. మా నాన్నమ్మ దీపారాధన చేస్తే.. దాంతో ఆయన సిగరెట్ వెలిగించుకునేవారు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


పవన్ చేసిన ఆ వ్యాఖ్యలపై.. మంత్రి స్పందించారు. 'పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని.. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?' అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. అటు నారా లోకేష్ పాదయాత్ర పైనా మంత్రి అంబటి సెటైర్లు వేశారు.


Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM