పొట్టకూటికోసం అమెరికా వెళ్లి....ప్రాణాలు కోల్పోయిన శ్రీకాకుళం జిల్లావాసి

by సూర్య | Fri, Jan 27, 2023, 09:05 PM

పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన మన వాళ్లు ఇటీవలప్రమాదాలలో మరణించడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడు రోజులకే ఊహించని విధంగా మృత్యువు వెంటాడింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లికి చెందిన రవికుమార్ ఈ నెల 17న మరో 10 మందితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరారు.


ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రవికుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం వెంటాడింది. అతడు ప్రమాదవశాత్తూ కంటెయినర్‌పై నుంచి జారిపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులకు గురువారం కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. ఆయనకు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలున్నారు. మృత దేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


నాలుగు రోజుల క్రితం అమెరికాలో మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్వవి ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లారు. సియాటిల్‌ప్రాంతంలో ఉంటున్న జాహ్నవి.. సోమవారం డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జాహ్నవి మరణవార్తతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


చికాగోలో కూడా తెలుగు విద్యార్థులపై కాల్పులు ఘటన కలకలంరేపింది. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్‌కు చెందిన సాయిచరణ్ చదువుతున్నారు. వీరిద్దరు మరో విద్యార్థితో కలిసి వెళ్తుండగా.. నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవాన్ష్, చరణ్‌లను ఆస్పత్రికి తరలించారు. అయితే దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా.. సాయిచరణ్ చికిత్సపొందుతున్నారు. ఇలా వరుసగా తెలుగువారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM