by సూర్య | Fri, Jan 27, 2023, 08:51 PM
నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
Latest News