జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు

by సూర్య | Fri, Jan 27, 2023, 03:28 PM

శ‌నివారం ఉదయం 9. 15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10. 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1. 30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ ఎం. వి. వి. సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1. 55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈమేర‌కు శుక్ర‌వారం అధికారులు సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM