20రోజుల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by సూర్య | Fri, Jan 27, 2023, 02:24 PM

20రోజుల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో అరుణ్‌ పాండు(23) అనే యువకుడు  మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే... కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం గుడికల్‌ గ్రామానిక చెందిన మహేంద్ర, రేణుకలకు ఇద్దరు కుమారులు. వీరిలో అరుణ్‌ పాండు కర్ణాటకలోని సిరిగుప్పలో ఓ ఫెర్టిలైజర్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కింద ఎస్సై పరీక్షలు రాశారు. గురువారం ఫర్టిలైజర్‌ దుకాణం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఆదోనికి వచ్చాడు. పనులు ముగించుకొని రాత్రి 10గంటల సమయంలో సిరిగుప్పకు వెళ్తుండగా సంతేకూళూరు సమీపంలోని ఇటిక్యాల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుణ్‌కు తల పగిలి రక్తపుమడుగులో మృతి చెందాడు. 20రోజుల్లో పెళ్లి.. ఉండగా ఇలా జరిగిందని తల్లి కన్నీరు మున్నీరు అయింది. ఇస్వి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM